
–ప్రస్తునం ఉన్న విఆర్ఎ, విఆర్ ఓలను “జిపిఓ”గా నామకరణం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఆర్ధిక శాఖ
స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్, మార్చి 22: తెలంగాణలో గ్రామ పరిపాలనను మరింత పటిష్టం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా రెవెన్యూ శాఖలో కొత్తగా 10,954 గ్రామ పాలనా అధికారుల (జి పిఓ) పోస్టులు మంజూరు చేశారు. మాజీ వీఆర్వోలు, మాజీ వీఆర్ఏ ల నుంచి ఆప్షన్లు తీసుకుని వీటి నియామకాలు చేపట్టనున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన తదుపరి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖను ఆర్ధిక శాఖ కోరింది.
