
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (సైదాపూర్),మార్చి26: మండలంలోని వెన్నంపల్లి గ్రామానికి చెందిన పేరాల రజిత భర్త విద్యాసాగర్ రావుకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బుధవారం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మారుపాక తిరుపతి ఆధ్వర్యంలో అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మారుపాక తిరుపతితో పాటు మాజీ సింగిల్ విండో అధ్యక్షులు సారబుడ్ల రాజిరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మొల్గూరి ఐలయ్య, మ్యాకల రవిందర్ రెడ్డి, బీస నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
