
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
బీసీ ఆజాద్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద చేస్తున్న నిరాహార దీక్షకు మద్దతుగా హుజురాబాద్ అంబేద్కర్ కూడలి వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ రిలే నిరాహార దీక్షలు బీసీ ఆజాద్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు కుడికాల భాస్కర్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు చిలుకమారి శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
దేశ వ్యాప్తంగా కుల గణన మరియు తెలంగాణ అసెంబ్లీ అమోదించిన బీసీలకి 42% వాటాని పార్లమెంట్ లో అమోధించి 9వ షెడ్యూల్ లో చేర్చాలి అని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మన జిల్లా ముద్దుబిడ్డ, బీసి ఆజాద్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ బీసిలకు విద్యా ఉద్యోగ రాజకీయాలలో 42%శాతం వాటా కొరకు మన తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి సిఫారసు చేసింది. అట్టి తీర్మానాన్ని ఆమోదింప చేసి 9 వ షెడ్యూల్లో చేర్పించి. మన, మన పిల్లల భవిష్యత్తుకు బాటలు వేయాలని సంజయ్ కుమార్ ఆమరణ దీక్ష చేపడుతున్నారు. కావున బీసిలు పాలుపంచుకోవాలని కావున గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి బీసీ బిడ్డ నడుంబిగించి ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కుల మతాలకతీతంగా, ప్రతి ఒక్కరూ బీసీల ఉద్యమానికి మద్దతు తెలుపాలని బీసీల బిల్లు ఆమోదం పొందడానికి ప్రతి ఒక్కరు పార్టీ నాయకులు పార్టీలకతీతంగా, బిల్లును ఆమోదింప చేయానికి కదం తొక్కాలి అని అన్నారు.
తెలంగాణ లో రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీల కి 42% వాటా ఇస్తా అని చెప్పిన మాట కోసం ఉద్యమం చేసింది వాటా కోసం పోరాటం చేసింది ఆమరణ నిరాహార దీక్ష చేసింది మన బీసీ అజాది ఫెడరేషన్ మన పోరాట ఫలితంగానే ఈరోజు రాష్టంలో కుల గణన చేయడం అసంబ్లీ లో తీర్మానం చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ అజాది ఫెడరేషన్ నుండి ప్రత్యేక ధన్యవాదములు అన్నారు. ఈరోజు రాష్ట్రంలో 56% ఉన్న బీసీలకు ఎంతమంది ప్రజా ప్రతినిధులు ఉన్నారు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారా ఒకసారి మనం ఆలోచిద్దాం ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుండి బీసీలు అగ్ర కులాల లీడర్ కింద జెండాలు పట్టడమే తప్ప ఎమ్మెల్యేలుగా, ముఖ్యమంత్రిగా అవ్వడం లేదన్నారు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆరోగ్యం బాగుండాలి అంటే చేపలు తినాలి అని చేప్తారు, ఆ చేపలు పట్టే చెరువులో చేపలు పట్టే మా ముదిరాజు బీసీలు…కాన్సర్ రాకుండా ఉండాలి అంటే తాటికల్లు పొసే మా గౌడున్నాలు మా బీసీలు..నూలు మగ్గం మీద బట్టలు నేసే మా పద్మశాలి వాళ్ళు బీసీలు…ఈరోజుల్లో పెళ్లి చేసిన, సచిపోయిన, చల్లని నీటి కోసం కుండలు తయారీ చేసే మరి కుమ్మరి వాళ్ళు బీసీలు…ఒక ఇంటిని తలుపు లు కిటికీ లు పెట్టె మా వడ్డరంగిలు బీసీలు…మనం చేసే పొలం పనులకి పారలు చేసే మా కమ్మరి వాళ్ళు బీసీలు…..మన బట్టలని ఎంత మంచిగా ఇస్త్రి చెసే మా రజకలు బీసీలు…ఎంత మంది ఉన్న మనం ఎందుకు రాష్టాన్ని పాలించలేము 10% ఉన్న అగ్ర కుల నాయకులు పలిస్తున్న రాష్టాలో బీసీలు అందరం మార్పు కావాలి మన వాటా మన ఓటు నినాదంతో బహుజన రాజ్యం రావాలి
రిలే నిరాహార దీక్ష చేసిన బీసీ ఆజాది ఫెడరేషన్ రాష్ట్ర రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చిందం సునీత, రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు రేవంత్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు సూదన్ రాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి ఇప్పకాయల సాగర్, రాష్ట్ర మహిళా నాయకురాలు బింగి రాణి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి జినుకల లక్ష్మణ రావు పటేల్, భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు క్యాతం మహేందర్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు చిదురాల సతీష్ , బీసి ఆజాద్ ఫెడరేషన్ తదితరులు పాల్గొన్నారు.




అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి దీక్షలకు దిగుతున్న బీసీ ఆజాద్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు కుడికాల భాస్కర్, తదితరులు