
- రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుంది.
- సన్న వడ్లకు బోనస్ తో గణనీయంగా పెరిగిన సన్నాల సాగు..
- త్వరలోనే రేషన్ కార్డుల పంపిణీ.
- మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: దేశంలో ఏ ప్రభుత్వం చేయని పనిని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని,రేషన్ కార్డు లబ్దిదారులకు సన్న బియ్యం పంపిణీ గొప్ప కార్యక్రమమని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. మంగళవారం నాడు హుజురాబాద్ మండల పరిధిలోని కందుగుల గ్రామంలో రేషన్ కార్డు లబ్దిదారులకు సన్న బియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మీడియతో వారు మాట్లాడుతూ పేదల అభ్యున్నతి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందని, గతంలో వరి వేస్తే ఉరి అని చెప్పిన నాయకులు ఆశ్చర్యపడేలా ఇతర దేశాలకు సైతం సన్న బియ్యాన్ని ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఏదిగిందని అన్నారు. సన్న బియ్యం పంపిణీ ద్వారా రాష్ట్ర ఖజానా మీద 2,300 కోట్ల అదనపు భారం పడుతున్న పేదల అభ్యున్నతి కోసం ఆలోచించామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మానవతా దృక్పథంతో పేదవాడి ఆకలి తీర్చడానికి కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 17,200 రేషన్ షాపులల్లో ఇలాంటి కార్యక్రమాన్ని చేస్తున్నామని,రానున్న రోజుల్లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. ఒక్కొక్కటిగా ఎన్నికల్లో ఇచ్చిన పనులన్నీ పూర్తి చేస్తామని,ప్రతిపక్ష నాయకులు చెప్పిన మాటలు నమ్మి మళ్ళీ మోసపోవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.





కందుగుల గ్రామంలో సన్న బియ్యం పంపిణీ చేసి ప్రజలను దర్శించి మాట్లాడుతున్న పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఓడితేల ప్రణవ్..





