
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలంలోని చెల్పూర్ గ్రామంలో జన వికాస సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఎండాకాలం బాటసారులకు దాహార్తిని తీర్చుటకు ఈ చలివేంద్రం చాలా తోడ్పడుతుందనీ, అన్ని దానాలలో కల్లా నీళ్ల దానం గొప్పదని నిర్వాహకులు పేర్కొన్నారు. గ్రామానికి చెందిన బుజ్జ సరిత మరియు అంబాల కుమారస్వామి, జేబునిస దాతలుగా ఈ జలదాన కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలవికాస హుజురాబాద్ ఏరియా సెంటర్ మేనేజర్ ఖాజాబీ, రజిత, కళ్యాణి, మహిళలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

