Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అద్యక్షులు, సుడా మాజీ చైర్మన్, ప్రముఖ న్యాయవాది జీవీ రామకృష్ణారావు జన్మదినం సందర్భంగా మానకొండూర్ మండల కేంద్రంలోని జీవీ నివాస గృహంలో సోమవారం రైతు, ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు నాయకులతో కలిసి జీవి రామకృష్ణారావుకు పూల బొకె అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సౌమ్యుడుగా వివాద రహితుడిగా జిల్లా వ్యాప్తంగా పేరున్న జీవీ సామాన్యులకు అందుబాటులో ఉంటూ అన్ని వర్గాల ప్రజల సమస్యలు పరిష్కరించే రామకృష్ణారావు మరెన్నో జన్మదిన వేడుకలను జరుపుకోవాలని ఆశిస్తూ, రాబోయే రోజుల్లో ఆయన ఉన్నత పదవులను అలంకరించాలని జిల్లా వ్యాప్తంగా జీవి అభిమానులమైన మేము హృదయపూర్వకంగా
కోరుకుంటున్నట్లు పోలాడి రామారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామారావుతో పాటు పోల్సాని దేవేందర్ రావు, రెడ్డి సంపత్ రెడ్డి, జనగామ దేవేందర్ రావు, గంగుల రవి, గడ్డి రాజు, అకునూరి రమేష్, పోల్సాని రాం కిషన్ రావు మానకొండూర్ నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులు, జీవి అభిమానులు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొని స్వీట్లు, మిఠాయిలు పంచుకొని జీవి కి జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు.








