
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుస్నాబాద్ జేఏసీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ అడిషనల్ డైరెక్టర్ ఆదేశాల మేరకు డ్రగ్స్ నిర్మూలన పోరుయాత్ర సైదాపూర్ మండలంలోని బొమ్మకల్, గొడిశాల, గుజ్జులపల్లె, ఎల్లంపల్లి, రాములపల్లె, ఎలపోతారం గ్రామాలలో ఈ కార్యక్రమం నిర్వహించారు. యువత డ్రగ్స్ బారిన పడి చనిపోతున్నారని చెడు దారి పడుతున్నారని అవగాహన కల్పించారు. తెలంగాణ సంస్కృత సారధి రావుల తిరుపతి టీం ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు కవ్వ లక్ష్మారెడ్డి, డేగల సారయ్య, కళాకారులు వడ్లకొండ అనిల్ కుమార్, మహాదేవుని శ్రీధర్, ఆవునూరి కోమల, దొగ్గాల శ్రీధర్, దోగ్గల రాజు, ఎర్ర సురేష్, రావుల సాయికుమార్, కోoకటి తిరుపతి, ఎండి ఆసియా, పోతనవేణి పద్మ తదితరులు పాల్గొన్నారు.