
మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ నూతన ఎసిపిగా వాసంశెట్టి మాధవి గురువారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇంతకాలం హుజురాబాద్ ఎసిపి గా పనిచేసిన సిహెచ్ శ్రీనివాస్ జి హైదరాబాద్ డిజి కార్యాలయానికి బదిలీ కాగా కరీంనగర్ లో డిసిఆర్ బిలో పనిచేస్తున్న మాధవి హుజురాబాద్ కు బదిలీపై వచ్చారు. కాగా పదవి బాధ్యతలు స్వీకరించిన మాధవిని పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. కాగా మాధవి బాధ్యతలు స్వీకరించే సమయంలో ఆమె సోదరుడు (అన్న) ఏసీబీ ఎసిపి వివి రమణమూర్తి వెంట ఉన్నారు.

హుజురాబాద్ ఏసిపిగా పదవీ బాధ్యతలు చేపడుతున్న వి మాధవి

ఏసిపి మాధవికి శుభాకాంక్షలు తెలుపుతున్న హుజురాబాద్ మాజీ ఎంపీపీ దంపతులు రాణి సురేందర్ రెడ్డి..
