
– తమిళనాడు నుండి వచ్చి చిన్న పిల్లల ఆహార పదార్థాలలో విషం నింపుతున్న మాఫియా..
▪️చిన్న పిల్లలు తినే ఆహార పదార్థాల్లో కల్తీ..వారి ప్రాణాలు అంటే లెక్కలేదా..
▪️ మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఉంటది కానీ ఎక్స్పైరీ డేట్ మాత్రం ఉండదు..
▪️
▪️ ఆఫీసర్స్ వచ్చి పోవడమేనా.. చర్యలు ఉంటాయా..
కుమార్ యాదవ్, స్వర్ణోదయం రిపోర్టర్ జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కొత్తపల్లిలో తమిళనాడు నుండి వచ్చి గత కొద్ది సంవత్సరాలుగా పిల్లలు తినే ఆహార పదార్థాలు కల్తీ వ్యాపారం చేయడం మామూలుగా జరిగిపోతుంది. కల్తీ ఆహార పదార్థాలు మార్కెట్లో రాజ్యమేలుతున్న, తయారీదారులు కనీస నాణ్యత ప్రమాణాలు పాటించకున్న, ఆయా ఆహార పదార్థాలపై తయారీ తేదీ, ఎంత కాలంలోగా వినియోగించాలనే వాటిని ముద్రించకుండానే విక్రయిస్తున్నా అటు కన్నీటి చూసేవారే కరువయ్యారు. దీంతో సదరూ వ్యాపారి విచ్చలవిడిగా ఆహార పదార్థాలు కల్తీ చేసి విక్రయిస్తున్నారు. సుగంధ ద్రవ్యాలు, నెయ్యి, డాల్డా, పోపు గింజలు, మసాల దినుసులు, పొడులు, పసుపు, కారం తదితర వస్తువులను పాలిథిన్ ప్యాకెట్లలో ప్యాక్ చేసి హోల్సెల్, రిటైల్ షాపులకు సరఫరా చేస్తున్నారు. ఆయా షాపుల నుంచి దుకాణాల ద్వారా వినియోగదారులకు చేరుతున్నాయి. తేనెలో పంచదార, బెల్లం పాకం కలుపుతున్నారు. పాపుడాలు, మిక్సర్, చేకోడిలు, రసగుల్లా, లడ్డు, ప్రతిదీ కల్తీ ఆహార పదార్థాలే తయారీ కేంద్రంలో దర్శనం ఇవ్వడంతో అధికారులు, పాత్రికేయులు ఒక్కసారిగా కంగుతున్నారు.
–కనీస నాణ్యత ప్రమాణాలు కరువు..
చిన్న పిల్లలు తినే ఫుడ్ లో కూడా నాసి రకం పసుపులో తౌడు, కారంపొడిలో కాల్చిన ఇటుకల పొడిని కల్తీగా వాడుతున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఆహార పదార్థాలను పాలిథిన్ కవర్లలో ప్యాక్ చేసి తయారీ, ఎక్స్పైరీ తేదీ, బ్యాచ్ నంబర్ ముద్రించకుండానే మార్కెట్లో విక్రయిస్తున్నారు. వాటిని కొనుగోలు చేసి చిన్న పిల్లలు, పెద్దలు, వృద్ధులు వ్యాధుల బారిన పడుతున్నారు.
▪️లైసెన్స్ లేకుండానే తయారీ
ఆహార పదార్థాల నాణ్యత ప్రమాణాలు పర్యవేక్షించేందుకు ఆహార నాణ్యత, ప్రమాణాల చట్టం 2006ను అనుసరించి (ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) నియంత్రణ సంస్థను భారత ప్రభత్వం ఏర్పాటు చేసింది. ఎలాంటి ప్యాకేజీ ఆహార పదార్థాలను ఉత్పత్తి, మార్కెటింగ్ చేయాలన్నా సంస్థ నుంచి లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆహార తయారీదారులు లైసెన్సులు లేకుండానే తయారు చేసి విక్రయిస్తున్నారు.
ఆహార కల్తీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇలాంటి ఆహార పదార్థాలు ఎక్కువ కాలం తీసుకోవడం శరీరానికి హానీకరం. రంగులు, రసాయనాలు వాడడం వల్ల ప్రాణాంతక కేన్సర్కు కారణమవుతాయి. గుండె, మూత్రపిండాలు, కాలేయం పాడై ప్రాణాంతకంగా మారుతాయి. విరేచనాలు, కడుపునొప్పి, కీళ్ల నొప్పులు కలుగుతాయి. కొన్ని కల్తీ ఆహార పదార్థాల వల్ల మెదడు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఆకర్షణీయంగా, రుచిగా తయారు చేయడానికి ఎన్నో రసాయనాలను కలుపుతున్నారు. అల్యూమినియం, పొటాషియం ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల మెదడు, ఎము కలు దెబ్బతింటాయి. జీర్ణాశయం దెబ్బతిని అల్సర్కు కారణమవుతాయి. చర్మంపై దద్దులు, మచ్చలు ఏర్పడే అవకాశం ఉంటుంది.కల్తీ రాయుళ్లు పెట్రేగిపోతున్నారు. స్థానికంగా నెయ్యి, డాల్డా, వంట నూనెలు, మసాల పొడులు, పోపు గింజలు, అల్లం వెల్లుల్లి, పసుపు, కారం, తదితర ఆహార పదార్ధాలను అనుమతి లేకుండా ప్యాకింగ్ చేసి మార్కెట్లోకి వదులుతున్నారు. చిన్న చిన్న పరిమాణంలో రూ.5, రూ.10 ప్యాకెట్లను పట్టణ, గ్రామీణ పేద, మధ్య తరగతి ప్రజలకు విక్రయిస్తున్నారు. ప్రజలు ఎప్పటికప్పుడు వాటిని కొనుగోలు చేసి ఉపయోగిస్తున్నారు. అనుమతులు లేని ప్యాకెజీ ఆహార పదార్థాలను విక్రయించడం వల్ల రిటైల్ షాపు నిర్వాహకులకు కూడా అధిక శాతం లాభం ఉండడంతో, షాపుల నిర్వాహకులు వినియోగదారులకు కల్తీ ఆహార పదార్థాలనే అంటగడుతున్నారు. ప్రభుత్వ సంస్థల అనుమతి పొంది నిర్ణీత ప్రమాణాలు పాటించే బ్రాండెడ్ ఉత్పత్తిదారులు చిన్న సైజు ప్యాకెట్లను తయారు చేయకపోవడంతో, కల్తీ వ్యాపారులకు వ్యాపారం వరంగా మారింది.
జిల్లా ఫుడ్ సెక్షన్ ఆఫీసర్ అంకిత్ రెడ్డి మాట్లాడుతూ..నాణ్యత ప్రమాణాలు లేని ఆహార పదార్థాలను ప్రజలు వినియోగించవద్దు అన్నారు. కల్తీ ఆహార పదార్ధాల కట్టడికి ప్రజల సహకారం అవసరం అన్నారు. తనిఖీలు పూర్తిగా చేశామన్నారు. ఎప్పటికప్పుడు కల్తీ ఉత్పత్తిదారులు కొత్త కొత్త పేర్లతో మార్కెట్లోకి వారి ఉత్పత్తులను చేరవేస్తున్నారన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చిన్న పిల్లలు తినే ఆహార పదార్థాలలో జాగ్రత్త వహించాలని తెలిపారు. ఆహార పదార్థాలకు సంబంధించిన, కొన్ని వారి వెంట తీసుకెళ్లారు. ముఖ్యంగా పిల్లల విషయంలో ఎవరు కల్తీ పదార్థాలు తయారు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.


ఆహార పదార్థాలు బూజు పట్టి కుళ్ళిపోయి చెడిపోయిన దృశ్యం.

సబ్సిడీ సిలిండర్లను వ్యాపారానికి వినియోగిస్తున్న చిరు తిను బడారాలు తయారు చేసే తయారీదారుడు..


కల్తీ ఆయిల్ వాడడమే కాక వేడిగా మరిగి మరిగి నల్లబడిన ఆయిల్ లో ఆహార పదార్థాలు తయారు చేస్తున్న దృశ్యం.

ఆహార పదార్థాలలో వాడుతున్న కల్తీ కారంపొడి..


నిలువ చేసిన బూజు పట్టిన ఆహార పదార్థాలను పరిశీలిస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారి..