
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: నవ భారత రాజ్యాంగ నిర్మాత రమాబాయి అంబేద్కర్ సతీమణి రమాబాయి అంబేద్కర్ 90వ వర్ధంతి కార్యక్రమం హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా దగ్గర అంబేద్కర్ జయంతోత్సవ కమిటీ చైర్మన్ మారపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. నాయకులందరూ కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ రమాబాయి అంబేద్కర్ పేద ప్రజల పిల్లల భవిష్యత్తు కోసం అంబేద్కర్ చేస్తున్న ఉద్యమానికి తన వంతుగా సహాయాన్ని అందించి కుటుంబాన్ని త్యాగం చేసి అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం అంబేద్కర్ కు అండగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో కలవల మల్లయ్య, మిడిదొడ్డి శ్రీనివాస్, రుద్రారపు రామచంద్రం, వేల్పుల రత్నం , ఖాలీక్ హుస్సేన్, మార్త రవీందర్, బుర్ర కుమార్, తునికి వసంత్, మొలుగూరి ప్రభాకర్, తునికి సమ్మయ్య, రామ్ రాజేశ్వర్, మట్టెడ ప్రకాష్, తిప్పరపు భువనచంద్ర, వేల్పుల ప్రభాకర్, కండె తిరుపతి తదితరులు పాల్గొన్నారు.