
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ పట్టణంలో అనారోగ్యంతో మృతి చెందిన రిటైర్డ్ టీచర్ పంజాల రాఘవులు గౌడ్, ఒడ్నాల కమలమ్మ కుటుంబ సభ్యులను హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు శనివారం సందర్శించి పరామర్శించారు. వారి మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రణవ్ వెంట సొల్లు బాబు, దశరథం, కొల్లూరి కిరణ్, మేకల తిరుపతి, గూడూరి స్వామిరెడ్డి, వడ్లూరి విజయకుమార్, ఆర్కే రమేష్, గంజి జయవర్ధన్, అల్లి రమేష్, మక్కపల్లి రమేష్, సలీం తదితరులు పాల్గొన్నారు.

ఒడ్నాల కమలమ్మ మృతదేహంపై పూలమాల వేసే నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ నేత ప్రణవ్…