
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలో వాడవాడనా విరివిగా మొక్కలు నాటాలని అందుకు ఇప్పటినుండి ఏర్పాట్లు చేయాలని కోరుతూ హుజరాబాద్ కు చెందిన సేవ్ ద ట్రీస్ నాయకులు స్థానిక మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్యకు వినతిపత్రం అందజేశారు. హుజురాబాద్ పట్టణంలో ఎప్పుడు ఏ కార్యక్రమము జరిగిన చెట్లు తీసివేసిన వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటాలని, వాడలలోని సిసి రోడ్లు చివర మొక్క నాటే స్థలం కోసం డ్రిల్లింగ్ చేసి ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో సేవ్ ద ట్రీస్ హుజురాబాద్
గౌరవ అధ్యక్షుడు సాదుల రవీంద్రబాబు, అధ్యక్షుడు మాటూరి అనిల్, ప్రధాన కార్యదర్శులు మక్కపల్లి రమేష్, కుడికాల ప్రభాకర్, మరియు ప్రకాష్, విక్రాంత్ తదితరులు పాల్గొన్నారు.
