
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఆదివారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ధర్మపురి శాసన సభ్యుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ఆయన నివాసంలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఓడితెల ప్రణవ్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల వారికి సమన్యాయం పాటిస్తూ మంత్రివర్గ విస్తరణ చేసిందని, రాష్ట్రంలోనైనా దేశంలోనైనా కాంగ్రెస్ పార్టీ ద్వారానే అన్ని వర్గాల వారికి సమన్యాయం చేస్తుందని మరొకసారి రుజువైందని వారు అన్నారు. ఈ సందర్భంగా నూతనంగా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
