
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, జూన్ 9: శాలపల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (MPPS) ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం జరిగింది. ప్రధానోపాధ్యాయిని పి శారద ఇంటింటి సర్వే చేసి, పాఠశాలలో లభించే సౌకర్యాలను తల్లిదండ్రులకు వివరించారు. ఐదేళ్లు పైబడిన విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చి, వారి భవిష్యత్తుకు బాటలు వేయాలని శారద కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య ఉచితంగా లభిస్తుందని, విద్యార్థుల సంఖ్యను పెంచడం అవసరమని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు, పద్మశాలి సంఘం అధ్యక్షులు వి. రమేష్ పాల్గొన్నారు.


చల్లపల్లిలో బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయురాలు శారద, ఉపాధ్యాయులు