
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: క్రీడాసక్తి కలిగిన విద్యార్థినీ విద్యార్థులు క్రీడా పాఠశాలలో ప్రవేశం పొంది రాష్ట్రానికి మంచి పేరు తేవాలని హుజురాబాద్ మండల విద్యాధికారి భూపతి శ్రీనివాస్ అన్నారు. బుధవారం హుజూరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో క్రీడా పాఠశాలలో ప్రవేశం కోసం పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మూడు క్రీడా పాఠశాలలు ఉన్నాయని వాటిల్లో ప్రవేశం పొందడం వల్ల మంచి క్రీడాకారులు తయారవుతారని అన్నారు. ప్రతి మండలంలో ఎంపికైన వారిని జిల్లా స్థాయిలో పోటీలు పెట్టి ఎంపిక చేస్తారని చివరికి రాష్ట్రస్థాయిలో ఎంపికైన వారికి ప్రవేశం లభిస్తుందని తెలిపారు. రెండు రోజులపాటు ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుందని, ఆసక్తి ఉన్న పిల్లలు పోటీలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ జిఎఫ్ కార్యదర్శి పిడి చిరుత శ్రీనివాస్, ఇతర వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎంఈఓ శ్రీనివాస్