
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ 14వ వర్ధంతి సందర్భంగా ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ హుజురాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో పెన్షనర్స్ భవన్లో సంఘ అధ్యక్షులు మహ్మద్ ఉస్మాన్ పాషా ఆధ్వర్యంలో ఘనంగా వర్ధంతి వేడుకలు నిర్వహించారు. అధిక సంఖ్యలో పెన్షనర్లు పాల్గొని తెలంగాణ జాతిపితకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్ పోరాడిన విధానం గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

జయ శంకర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న రిటైర్డ్ ఉద్యోగులు..





