
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరాటే విద్యతో విద్యార్థిని విద్యార్థులకు మనోధైర్యం కలుగుతుందని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ & రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ అన్నారు. శుక్రవారం కాకతీయ ఉన్నత పాఠశాలలో గ్లోబల్, షాటో కాన్ కరాటే డు అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.కె జలీల్ ఆధ్వర్యంలో బెల్ట్ మెరిట్ టెస్టుల్లో విజయం సాధించిన కరాటే విద్యార్థులను సన్మానించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ కరాటేను తన వృత్తిగా ఎంచుకొని ఎస్కే జలిల్ ఎంతోమంది విద్యార్థిని, విద్యార్థులను తీర్చిదిద్దారని అన్నారు. ద్వారా విద్యార్థులకు శారీరక అభివృద్ధి తో పాటు మానసికంగా ఎదుగుదలకు, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించడంలో కరాటే తోడ్పడుతుందని అన్నారు. ముఖ్యంగా కరాటే ఆడపిల్లలకు ఎంతోగానో తోడ్పాటు అందిస్తుందన్నారు. కరాటేను విద్యార్థిని, విద్యార్థులు ఇష్టంతో నేర్చుకోవాలని సూచించారు. కరాటేను తన వృత్తిగా ఎంచుకొని, తోటి కరాటే మాస్టర్స్ కు ఆదర్శంగా ఉంటూ, ఎంతోమంది విద్యార్థుల ను తీర్చిదిద్దుతు, వారి భవిష్యత్తుకు పునాది వేస్తున్న కరాటే శ్రమజీవి మాస్టర్ ఎస్కే జలీల్ ను అభినందించారు. కరాటే విద్యార్థుల శారీరక అభివృద్ధితో పాటు, వారు మానసికంగా ఎదుగుటకు అదేవిధంగా కరాటే పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతోపాటు, సమాజంలోని ఏ సమస్యనైనా ఎదుర్కొనుటకు తోడ్పడుతుందన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు ధైర్యంగా ముందడుగు వేస్తూ తమను తాము రక్షించుకోవడంతోపాటు, తోటి ఆడపిల్లలను కాపాడడానికి వారిలో ధైర్యాన్ని పెంపొందిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ పిఈటి సొల్లు సారయ్య, ముదిరాజ్ సంఘం జిల్లా నాయకులు కొలిపాక సమ్మయ్య, కాంగ్రెస్ నాయకులు ఉప్పు శ్రీనివాస్, అంబేడ్కర్ జయంతి ఉత్సవ కమిటీ మాజీ అధ్యక్షులు ఖలీద్ హుస్సేన్, ఆకుల సదానందం, బత్తుల రాజకుమార్, టి.గోపాల్, దాసరి మల్లేశం, ఎండి సల్మాన్ విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

