
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ లో ఎలాంటి అనుమతులు లేకుండా శ్రీ కాకతీయ పాఠశాలలో శ్రీ చైతన్య పేరిట ఐదు సంవత్సరాల నుండి శ్రీ చైతన్య కరీక్యులం పేరిట పాఠశాల నడుపుతూ అమాయకులైన తల్లిదండ్రులను పేద విద్యార్థులను మోసం చేస్తున్నారని టీవీ వైఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కర్రే శ్రీధర్ రెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో మండిపడ్డారు. ఎన్నిసార్లు మండల విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకున్న పాపన పోవడం లేదు అని మండిపడ్డారు. అంతేకాకుండా వేరే చోట్లో పుస్తకాలు బుక్కులు తమ ఉపాధ్యాయులచే అమ్మిస్తున్నారని ఆరోపించారు. ఈ తాతంగంపై హుజురాబాద్ ఎంఈఓ నీ ఫోన్లో వివరణ అడగాగా హుజురాబాద్ లో శ్రీ చైతన్య లేదు అని చెప్పారు. ఇదే విషయాన్ని విద్య శాఖ అధికారీ పత్రికా ముఖంగా తల్లిదండ్రులకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల మండల విద్యా శాఖ కార్యాలయం ముట్టడిస్తామని శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కర్రే శ్రీధర్ రెడ్డి..





