
మండల యాదగిరి, స్వర్ణ ఉదయం ప్రతినిధి హుజురాబాద్ జూలై 01: మేడారం, రామప్ప, లక్నవరం మరియు మల్లూరు నరసింహ స్వామి ఆలయం హుజురాబాద్ ఆర్టీసీ డిపో నుండి సూపర్ లగ్జరీ బస్సు సౌకర్యం ఈనెల 6న కలదని హుజురాబాద్ డిపో నుండి ఉదయం 5:00 గంటలకు బయలుదేరి సాయంత్రం 6:00 గంటలకు హుజురాబాద్ కి చేరుకోబడును , ఇట్టి అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని హుజురాబాద్ డీఎం రవీంద్రనాథ్ తెలిపారు. సూపర్ లగ్జరీ బస్సుకు చార్జి పెద్దలకు రూ.800/-, పిల్లలకు రూ.500/- గా నిర్ణయించబడినదని, అడ్వాన్స్ బుకింగ్ కొరకు ఈక్రింది ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని కోరారు. 9959225924, 9704833971, 9247159535, 9177324963 కి ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం కుడా ఉన్నదని, సర్వీసు నెంబర్ 95517 ఇట్టి అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డీఎం సూచించారు.








