
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రాథమిక డాక్టర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్బిఎస్ కే సిబ్బంది, డిప్యూటీ డిఎంహెచ్వో కార్యాలయ సిబ్బంది, చేల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ చందుని, వైద్యాధికారి డాక్టర్ మధుకర్ ను, పల్లె దావకాన వైద్యాధికారులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్యాం నాయక్, ఆర్ బి ఎస్ కే సిబ్బంది డాక్టర్ సరిత, డాక్టర్ రేఖ, డాక్టర్ ప్రశాంత్, సిబ్బంది పాల్గొన్నారు.



వైద్యుల దినోత్సవం పురస్కరించుకొని కేక్ కట్ చేస్తున్న డిప్యూటీ డీఎంహెచ్వో చందు, వైద్యులు..






