
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఎమ్మెల్సీ, టిపిసిసి ఉపాధ్యక్షుడు డాక్టర్ బాల్మూర్ వెంకట్ సహకారముతో సీఎంఆర్ఎఫ్ నిధి నుండి కమలాపూర్ మండలం అంబాల గ్రామానికి చెందిన బోయినీ రాజుకుమార్ కి రూ. 30.000వేల రూపాయలు, జమ్మికుంట గ్రామానికి చెందిన కొరపల్లి అనిల్ కి రూ. 60,000వేల రూపాయల చెక్కులు మంజూరయ్యాయి. ఈ మేరకు గురువారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దేశిని అయిలయ్య గౌడ్ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. బాధితుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సకాలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంజూరు చేయించిన ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ కి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అంకటి వేంకటేశ్వర్లు, కుమ్మరి నాగరాజు, బొల్ల సాగర్, జానుగానీ వీరాస్వామి, దేశిని వీరయ్య, కుమ్మరి కృష్ణ, జేరుపోతుల వినయ్ తదితరులు పాల్గొన్నారు.


లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేస్తున్న మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఐలయ్య, కాంగ్రెస్ నాయకులు..





