
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: గత 35 సంవత్సరాలుగా విద్యారంగంలో విశేష సేవలు అందించినందుకు గాను యూకే కి చెందిన హోప్ థియాటికల్ యూనివర్సిటీ అధికారులు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణానికి చెందిన ట్రస్మా జిల్లా అధ్యక్షులు కోరెం సంజీవరెడ్డికి బుధవారం రాత్రి హైదరాబాదులో డాక్టరేట్ పట్టాను అందించారు. టెట్రా స్కూల్ అధిపతిగా, ట్రస్మా జిల్లా అధ్యక్షులుగా విద్యారంగానికి విశేష సేవలు కోరెం సంజీవరెడ్డి అందించిన దృష్ట్యా ఆయనకు విద్యారంగ సేవకు గుర్తింపుగా డాక్టరేట్ ప్రధానం చేశారు. ఆయనకు డాక్టర్ రావడం పట్ల పలు విద్యాసంస్థల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, అతని మిత్రులు, శ్రేయోభిలాషులు సంజీవరెడ్డికి అభినందనలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు.


డాక్టరేట్ అవార్డుతో కోరెమ్ సంజీవరెడ్డి …

సంజీవరెడ్డి అందుకున్న డాక్టరేట్ పత్రం…





