
– అభివృద్ధే పరమావధిగా కాంగ్రెస్,బోగస్ మాటలతో బీఆర్ఎస్ ప్రచారం.
జూబ్లీహిల్స్ వేదికగా హుజూరాబాద్ నియోజవర్గ పరువు తీస్తున్న కౌశిక్ రెడ్డి.
– కౌశిక్ రెడ్డి రీల్స్ చేయడం ఆపి,రియల్ లోకి రావాలని ప్రణవ్ హితవు..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా హుజూరాబాద్ నియోజవర్గ పరువు తీస్తున్నాడని, జూబ్లీహిల్స్ లో దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నాడని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ అనంతరం ఆయన మాట్లాడుతూ హుజురాబాద్ సంబంధించిన వ్యక్తులతో చిట్ చాట్ కార్యక్రమం పెట్టి, లేని వ్యక్తులను జూబ్లీహిల్స్ లో ఉన్నట్టుగా బోగస్ ప్రచారాలు చేస్తున్నాడని, ప్రచారం చేయాలి కానీ మరి రాజకీయాల్లో ఇంత దిగజారుడు రాజకీయం పనికిరాదని, జూబ్లీహిల్స్ లో యువత నవీన్ యాదవ్ కు మద్దతు ప్రకటిస్తూ ఆయన సోషల్ మీడియానే చెప్తుందని ఇది చూసైన కౌశిక్ రెడ్డి బుద్ధి తెచ్చుకోవాలని అన్నారు. హుజురాబాద్ వేదికగా చస్తా అని బ్లాక్ మెయిల్ రాజకీయాలు జూబ్లీహిల్స్ లో పని చేయవు అని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ ను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.


మాట్లాడుతున్న కాంగ్రెస్ నేత వోడితల ప్రణవ్





