
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజరాబాద్ మండలంలోని గ్రామపాలన అధికారుల కార్యవర్గ నూతన కమిటీ ఎన్నిక శుక్రవారం జిల్లా అధ్యక్ష కార్యదర్శుల ఆదేశాల మేరకు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా గొల్ల రాజు (చెల్పూర్), ప్రధాన కార్యదర్శిగా పుట్ట విజయలక్ష్మి( రాంపూర్), ఉపాధ్యక్షులుగా నారాయణపురం రాజు( జిపిఓ), కోశాధికారిగా కొలకాని రాజు (సిర్సాపల్లి ),ఆర్గనైజర్ వేముల సరిత (హుజురాబాద్), కార్యవర్గ సభ్యులుగా మేకల సునీత (కాట్రపల్లి), దొనికేనా సుమలత(హుజురాబాద్), ఉడుత అనూష (ధర్మరాజు పల్లి), గడ్డం ప్రశాంత్ కుమార్ (కనుకులగిద్ద), అంతడుపుల రాజు (పోతిరెడ్డి పేట),గోపి భాస్కర్ (సింగపూర్), బైరి గణేష్ (జూపాక) ఎన్నుకొన్నట్లు వారు తెలిపారు. నూతన నియామక పత్రాన్ని తాసిల్దార్ జె. నరేందర్ కు అందజేశారు.

నూతన నియామక పత్రాన్ని తాసిల్దార్ జె. నరేందర్ కు అందజేస్తున్న నూతన కమిటీ సభ్యులు…





