
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో మంగళవారం పురుషుల కుటుంబా నియంత్రణ ఆపరేషన్ (NSV) శిబిరం విజయవంతమైంది. ఈ సందర్భంగా 28 మంది పురుషులకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు ప్రత్యేక శాస్త్ర చికిత్స వైద్య నిపుణులు డాక్టర్ పి శ్రీకాంత్ రెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ చందు హాజరై మాట్లాడుతూ కుటుంబ నియంత్రణ పాటించడం వల్ల అధిక జనాభాను అరికట్టవచ్చునని, మహిళల కన్నా పురుషులు చేసుకోవడం వల్లనే ఉపయోగాలు ఉంటాయని సులువుగా క్షేత్ర చికిత్స చేయవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరిండెట్ డాక్టర్ నల్ల నారాయణరెడ్డి, డాక్టర్ జరీనా, హెల్త్ అసిస్టెంట్ సత్యం, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, ఇతర వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

శాస్త్ర చికిత్సలకు వచ్చిన ఔత్సాహికులకు సూచనలు చేస్తున్న డిప్యూటీ డిఎంహెచ్వో చందు..

కూని శిబిరామ్ లో ఔత్సాహికులకు వైద్య పరీక్షలు చేస్తున్న సిబ్బంది..



ప్రత్యేక శాస్త్ర చికిత్స వైద్య నిపుణులు డాక్టర్ పి శ్రీకాంత్ రెడ్డి తో కునీ ఔత్సాహికులు…





