
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:నూతన సంవత్సర సందర్భంగా మహిళలకు బిఆర్ఎస్ పార్టీ నాయకురాలు ఆకినపల్లి శిరీష ప్రవీణ్ నూతన వస్త్రాలు పెడుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. పాత బాధలు ఏమున్నా తొలగిపోయి, నూతన సంతోషం, ఆశలు ఆశయాలు అన్ని ఈ నూతన సంవత్సరంలో నెరవేరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానన్నారు. ఈరోజు తోకలపల్లి, చెల్పూర్, ,శాల్లపల్లి, ఇందిరానగర్ చర్చ్ ల సుమారు 120 మంది మహిళలకి చీరలు పంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఇంద్రనగర్ సర్పంచ్ ప్రవీణ్, హాయ్ ఆయా చర్చిల ఫాదర్లు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.


మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్న ఆకినపల్లి శిరీష ప్రవీణ్…

మాట్లాడుతున్న ఆకినపల్లి శిరీష ప్రవీణ్





