
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని శస్త్ర పబ్లిక్ స్కూల్లో శనివారం హౌస్ ఎన్నికలు నిర్వహించారు. కరస్పాండెంట్ వేణుమాధవ్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో సీవీ రామన్, ఆర్యభట్ట, రామానుజన్, చాణక్య హౌస్లకు చెందిన విద్యార్థులు బ్యాలెట్ బాక్స్లో ఓటు వేశారు. ప్రతి హౌస్లో సుమారు 45మంది విద్యార్థులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.


ఈ సందర్భంగా కరస్పాండెంట్ వేణుమాధవ్ మాట్లాడుతూ విద్యార్థులకు ఓటు హక్కు ప్రాధాన్యం, ప్రజాస్వామ్యంలో ఎన్నికల విలువపై అవగాహన కల్పించారు. ఎన్నికల ప్రక్రియను ప్రత్యక్షంగా నిర్వహించడం ద్వారా చిన్నారుల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తిని పెంపొందించేందుకు కృషి చేసింది అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ముంజాల సంగీత, ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.





