
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలోని
5వ వార్డులో కౌన్సిలర్ సొల్లు సునీత ఆధ్వర్యంలో శనివారం మహిళలు మెహిందీ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఉదయం మహిళలంతా ఒకచోట చేరి గోరింటాకును దంచి సిద్ధం చేశారు. అనంతరం పాటలు పాడుతూ మహిళలు ఒకరికొకరు గోరింటాకును పెట్టుకున్నారు.




ఈ సందర్భంగా కౌన్సిలర్ సునీత మాట్లాడుతూ…
ఆషాడ మాసంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం సాంప్రదాయం అని, అది ఎర్రగా పండితే వారి బ్రతుకులు పండుతాయి అని ఒక నమ్మకం, విశ్వాసం అన్నారు. ఈ సాంప్రదాయాన్ని మతాలకతీతంగా కులాలకతీతంగా వర్గాలకు అతీతంగా ఈ పండుగను జరుపుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐదవ వార్డు మహిళ లు పాల్గొన్నారు.





