
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఆదివారం పట్టణంలోని సివిల్ సప్లై గోదాం వద్ద హమాలీ కార్మికుల సమక్షంలో బిఆర్ఎస్ నాయకుడు మోరే మధు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జన్మదిన కేక్ కట్ చేసి స్థానిక హమాలీ కార్మికులకు కేకులు, స్వీట్లు పంపిణీ చేశారు. శ్రీనివాస్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకుడు మోరే మధు, హమాలి నాయకులు కొండ్ర కనకయ్య, దేవరకొండ రాజయ్య, మాతంగి శ్రీకాంత్, విల్సన్, రాజేష్, రాకేష్, సంపత్, మహేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు.
