
-తెలంగాణ ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తల్లి తండ్రులకు విజ్ఞప్తి.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాల లో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించాలని తెలంగాణ ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ పిల్లల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఉర్దూ మీడియం పాఠశాలలో పిల్లలను చదివించడానికి ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ చాలామంది తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు చేర్పించడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం ప్రజలను దృష్టిలో పెట్టుకొని అన్ని ఉర్దూ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయులు చాలా మంచిగా బోధిస్తున్నారన్నారు. కనుక తమ పిల్లలను ఉర్దూ మీడియం మరియు మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో మీ పిల్లలను చేర్పించి వారి భవిష్యత్తును చక్కదిద్దవలసిన బాధ్యత ప్రతి తల్లిదండ్రుల మీద ఉంటుందని ముజాహిద్ హుస్సేన్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉర్దూ మీడియం పాఠశాలలో చదివే పిల్లలకు ప్రభుత్వమే ఉచితముగా పుస్తకాల పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టిందని, కనుక మీ పిల్లలను ఈ నెల 12వ తేదీ నుండి ఉర్దూ మీడియం పాఠశాలలో, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో పిల్లలను చేర్పించి వాళ్ల భవిష్యత్తుకు పునాది వేయాలన్నారు. పిల్లలను అన్ని విధాలుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు ఎంతో కృషి చేస్తారని, వారు చదువుకున్నట్లయితే వారి కాళ్ళ మీద వారు నిలబడి ఇతరులను కూడా రేపటి రోజులలో పోషించుకుంటారన్నారు. పిల్లల భవిష్యత్తు చక్కగా ఉండాలంటే తల్లి దండ్రులు చొరవ తీసుకొని వారి పిల్లలను ఉర్దూ మీడియం పాఠశాలలో, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పించాలని కోరారు. మంచి భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఆలోచించాలని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ వారిని కోరారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలలో అన్ని మైనార్టీ రెసిడెన్షియల్ బాలుర, బాలికల పాఠశాలలో పిల్లలను చేర్పించుకోవడానికి ఆయా మైనార్టీ పాఠశాలల తరఫున పాంప్లెట్లు కూడా పంపిణీ చేస్తున్నారన్నారు. కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ పాఠశాలలో చదువుకునే పిల్లలకు ఆహారం, పుస్తకాలు, డ్రెస్సులు అందించి మంచి వాతావరణంలో పాఠశాలలు కొనసాగిస్తున్నాయన్నారు. కనుక మీ పిల్లల భవిష్యత్ చక్కబడాలంటే మీ పిల్లలను వెంటనే మైనార్టీ గురుకుల పాఠశాలల్లో పిల్లలను వెంటనే చేర్పించాలని ముజాహిద్ పిలుపునిచ్చారు.
