
స్వర్ణోదయం ప్రతినిధి న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. 7 రాష్ట్రాల్లో 13 స్థానాలకు జులై 10న పోలింగ్, జులై 12న ఓట్ల లెక్కింపు జరగనుంది. బెంగాల్ 4, హిమాచల్ ప్రదేశ్ 3, ఉత్తరాఖండ్ 2 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తారు. బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, పంజాబ్లో ఒక్కో స్థానానికి ఉపఎన్నిక జరగనుండగా ఆయా రాష్ట్రాలలో ఎన్నికల కోడ్ నేటి నుంచి అమలులోకి వచ్చింది.
