
-వాపస్ తీసుకుంటున్న ప్రభుత్వం
–తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్:
తెలంగాణలో పాఠ్య పుస్తకాలు వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. బుధవారం నిన్న పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు అధికారులు పాఠ్య పుస్తకాలు, వర్క్బుక్లు పంపిణీ చేసింది విదితమే. అయితే గత ఏడాది అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం రూపొందించిన ముందు మాటనే నేటి పుస్తకాలలో ఉండడంతో విద్యాశాఖ వీటిలో ముందుమాట మార్చకుండా ముద్రించింది. ఇది వివాదాస్పదం కావడంతో వాటిని వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ఇచ్చిన పుస్తకాలు వాపస్ తీసుకోవడం పలు విమర్శలకు దారితీస్తుంది.






