
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ : సైదాపూర్ మండలం గొడిశాల గ్రామంలో శనివారం ఎల్లమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. సైదాపూర్ మండలంలోనే గొడిశాల ఎల్లమ్మ జాతరకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక్కడ జరుగు జాతరను చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలే కాకుండా. వివిధ జిల్లాల నుండి హైదరాబాద్, మహారాష్ట్ర నుండి కూడా ప్రజలు ఇక్కడికి వచ్చి జాతరను, గొడిశాల ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని వెళ్తారు. కోరిన కోరికలను తీర్చే దేవతగా గోడిశాల ఎల్లమ్మ తల్లినీ ప్రజలు నమ్ముతారు.








