
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజరాబాద్: పట్టణానికి చెందిన ప్రముఖ కవి రచయిత, మానవ విలువల పరిరక్షణ జాతీయ అధ్యక్షులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ నాగుల సత్యం గౌడ్ కు జాతీయస్థాయి జ్ఞాన బుద్ధ పూర్ణిమ పురస్కారాన్ని, మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు జయంతి ఉత్సవాలు 2024 సంవత్సరంను పురస్కరించుకొని తెలుగు వెలుగు సాహితీ సంస్థ వేదిక, విశ్వకర్మ వేద పురోహిత పాఠశాల వేములవాడ శ్రీ విరాట్ విశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక ధార్మిక కళాపరిషత్.. పలు స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో సత్యం గౌడ్ కు జాతీయస్థాయి జ్ఞాన బుద్ధ పూర్ణిమ పురస్కార ప్రధానం చేశారు. ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పోలోజు రాజ్ కుమార్, వివిధ సంస్థల అధ్యక్షులు సత్యగౌడ్ సామాజిక సేవలు, వారి రచనలు, ఆధ్యాత్మిక బోధనలు గుర్తించి.. వీరిని జాతీయస్థాయి జ్ఞాన బుద్ధ పూర్ణిమ పురస్కారానికి ఎంపిక చేసి ఈ పురస్కారాన్ని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఫిలిం భవన్ లో ఆదివారం సత్యంగౌడ్ కు పట్టు శాలువా కప్పి, జ్ఞాపకను అందజేసి, గురు కిరీటాన్ని గోల్డ్ మెడల్ను దరింపజేసి, జ్ఞాన బుద్ధ పూర్ణిమ పురస్కారంతో ఘనంగా సత్కరించారు. ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పోలోజు రాజ్ కుమార్ సభాధ్యక్షులు శాంతి కృష్ణ సంస్థ వ్యవస్థాపకులు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అవార్డు గ్రహీత, సరస్వతి మాత ఉపాసకులు బ్రహ్మశ్రీ విశ్వ కళ విరాట్ డాక్టర్ వంగల శాంతి కృష్ణచార్యులతోపాటు ముఖ్య అతిథులు, ప్రముఖ హాస్య నటి కిరీట మరియు సినీ నటులు, ఆర్ఎస్ నంద, బ్రహ్మశ్రీ ఆర్ఎస్ భాస్కరాచార్యులుశర్మ,, ఆర్ఎస్ డాక్టర్ వనబోజు మోహన్ రావు, అక్కనపల్లి యాదగిరి గౌడ్, వెంపటి శ్రావణి, సిహెచ్ జయలక్ష్మి, వీలు రమేష్ , వనవోజు మోహన్ రావు, నంద చంద్రకుమార్, బ్రహ్మశ్రీ కన్నకంటి వెంకటరమణ, డాక్టర్ గాయత్రి సురేష్ రెడ్డి, సామాజిక కార్యకర్త డాక్టర్ ఎస్ అనిల్ కుమార్ శర్మ, సౌత్ ఇండియా చైర్మన్ నేషనల్ సోషల్ వర్క్స్ ఆర్గనైజేషన్, కటకం రాజేంద్రప్రసాద్, పెందట సోము, రంగశెట్టి రమేష్, అడ్డంకి కృష్ణమాచారి, మానపాటి ప్రదీప్ కుమార్, డాక్టర్ పాడి శెట్టి విష్ణువర్ధన్, బ్రహ్మశ్రీ తుమ్మనపల్లి పూర్ణచంద్ర చార్యులు, పాడిశెట్టి గోపి నాదాచార్యులు, జిలకర వెంకన్న, కనుగుల మోహన్,, తాళ్లపల్లి స్వాతిక, వేములవాడ రాధిక, ప్రముఖ కవి రచయిత కృష్ణమాచార్య, కళాకారుని రమాదేవి, కోమల కీర్తి, ప్రముఖ కవి రచయిత మహానటుడు తెన్నటి మాస్టర్ గౌరీ శంకర్, లక్ష్మి నరసింహస్వామి, పోలిశెట్టి విష్ణువర్ధన్, కవి రచయిత నటులు దీక్షితులు, మోహన్ రావు, ప్రముఖ కవి రచయిత ఎస్ ఎఫ్ ఎస్ కొండ మోహన్ రావు, డాక్టర్ పోలోజు భాస్కరాచార్యులు, ప్రముఖులు విద్యావేత్తలు, నాయకులు సత్యం గౌడ్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు రాజకుమార్ తో పాటు పలువురు ప్రముఖులు మాట్లాడుతూ.. సత్యంగౌడ్ సామాజిక సేవలు, వారి సామాజిక రచనలు, ఆధ్యాత్మిక బోధనలు ముఖ్యంగా పాఠశాల మరియు కళాశాలలో విద్యార్థుల ప్రయోజనం కోరుతూ .. వారి ఉజ్వల భవిష్యత్తు కోసం, ప్రతి విద్యార్థి ప్రయోజకుడిగా ఎదిగి, చదువుతో పాటు, సమాజ సేవలో భాగస్వాములై, మనం ఏర్పరచుకున్న మానవతా విలువలు పెంపొందించుకోవాలి అనే పలు ప్రధాన అంశాల మీద సెమినార్లు ఇస్తున్న సత్యం గౌడ్ నిస్వార్థ సేవలు ఆదర్శప్రాయమన్నారు. అనంతరం సత్యంగౌడ్ మాట్లాడుతూ .. ప్రతి ఒక్కరు సేవ దృక్పదాన్ని అలవర్చుకొని మానవ జన్మను సార్థకం చేసుకోవాలని సూచించారు. స్వలాభం సంతృప్తి ప్రధానం కాదని, సాటి మనిషి మేలుకోరడంలోనే మానవత్వం దాగి ఉందన్నారు. ప్రతి ఒక్కరు, మనం ఏర్పరచుకున్న విలువలు కాపాడుకుంటూ, విలువైన పౌరులుగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖలు ప్రజా ప్రతినిధులు, విద్యావేత్తలు, భక్తలు ప్రొఫెసర్లు డాక్టర్లు, కళాకారులు కవులు రచయితలు తదితరులు పాల్గొన్నారు.

