
సుడా చైర్మన్ గా భాద్యతలు స్వీకరించిన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్, జూలై 08: శాతవాహన అర్భన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సోమవారం పదవీ భాద్యతలు స్వీకరించారు. సుడా వైస్ చైర్మన్ గా ఉన్న అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ కోమటిరెడ్డి చార్జి ఇచ్చారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ నా నియామకానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి శాసన సభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, విప్ లు లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, విజయరమణారావు, మక్కాన్ సింగ్ రాజ్ టాగూర్ తదితరులందరికి కృతజ్ఞతలు తెలిపారు. సుడా పరిధిలో ఉన్న అన్ని గ్రామాలతో పాటు నగరంలో విలీనమైన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న ప్రతి కార్యకర్త, నాయకులకు అందుబాటులో ఉండి వారు తీసుకొచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తానని అన్నారు. వైయస్ఆర్ జయంతి రోజు భాద్యతలు తీసుకోవడం శుభపరిణామం అని నరేందర్ రెడ్డి అన్నారు. నాయకులు కార్యకర్తలు అభినందనలు తెలిపారు.






