
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: ఏపి డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ కు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరిక జారీ చేశాయి. పవన్ కళ్యాణ్ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర నిఘా వర్గాలు సూచించాయి. పవన్ కళ్యాణ్ జాగ్రతగా ఉండాల్సిన అవసరం ఉందని నిఘా వర్గాలు తెలిపాయి. కొన్ని అవాంఛనీయ గ్రూపులో పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావన వచ్చినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఆ గ్రూపులు ఎవరివి అనేది ఇప్పుడే తేల్చలేమని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో పవన్ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు భద్రత పెంచినప్పటికీ తీవ్రవాదులనుంచి ముప్పు ఉందని నిఘా వర్గాలు తెలపడంతో సొంత పార్టీ నాయకులను, కార్యకర్తలను కూడా కొన్నాళ్లు దూరం పెట్టాల్సి వస్తుందని నిఘా వర్గాల వినికిడి.






