Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణమాదిగ చేసిన పోరాటాలు చిరస్మరణీయం అని ఎమ్మార్పీఎస్ జమ్మికుంట మండల మాజీ అధ్యక్షులు దొగ్గల భాస్కర్ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలుబడిన తర్వాత ఈరోజు శుక్రవారం జమ్మికుంట మండలంలోని వెంకటేశ్వరపల్లి గ్రామంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ కు పూలమాలవేసి మంద కృష్ణమాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ గత 30 సంవత్సరాలుగా చేసిన పోరాటం వృధా కాలేదని భారత అత్యున్నత న్యాయస్థానం మా పోరాటాన్ని గుర్తించి వారికి న్యాయం చేయాలనే సంకల్పంతో ఎస్సీ వర్గీకరణ పై సంచలనాత్మక తీర్పును ప్రకటించడం సంతోషంగా ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జమ్మికుంట మండల మాజీ అధ్యక్షులు దొగ్గల భాస్కర్ , బోయిని అంకుష్, ఆసాల సారయ్య, రెంటాల మహేందర్, సిరిపల్లి సమ్మయ్య, బండారి శంకర్ ,పుల్లూరు రాజేష్ ,మచ్చ మొగిలి ,పుల్లూరు రామచంద్రం, కొమ్ము శీను, అల్లకొండ బాబు, కొమ్ము పోచయ్య, పుల్లూరు , దుర్గయ్య పుల్లూరు నర్సయ్య, దొగ్గల పూలమ్మ, పుల్లూరు చిలుకమ్మ తదితరులు పాల్గొన్నారు.







