
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ప్రతి సంవత్సరం ఆగస్టు ఒకటి నుండి 7వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందనీ హుజురాబాద్ ఐసిడిఎస్ సిడిపిఓ సుగుణ తెలిపారు. హుజురాబాద్ పట్టణంలోని అంగన్వాడీ కేంద్రం 2 లో ఈ వేడుకలు నిర్వహించగా ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పుట్టిన వెంటనే గంటలోపు తొందరగా బిడ్డకు ముర్రుపాలు పట్టాలని, తల్లిపాలలో వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉంటుందని తెలిపారు. ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలని హుజురాబాద్ అంగన్వాడీ కేంద్రం 2 లో, ఏరియా సివిల్ హాస్పిటల్ లో గర్భిణీ, బాలింతలు, తల్లులకు సూచనలు ఇచ్చారు. రెండవ సెంటర్లో చిన్నారులకు అన్నప్రాసన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ సుగుణతో పాటు సూపర్వైజర్ రాజశ్రీ, పోషణ్ అభియాన్ సిబ్బంది, అంగన్వాడి టీచర్లు పి జయ, అరుణ, పద్మ, సుకన్య, సబిత, పావని, సంధ్య, తల్లులు పాల్గొన్నారు.
