
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కమలాపూర్ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఏసిపి పింగిలి ప్రశాంత్ రెడ్డి తండ్రి పింగిలి జగన్మోహన్ రెడ్డి పది రోజుల క్రితం గుండెపోటుతో మరణించగా విషయం తెలుసుకున్న ప్రముఖ చిత్రకారుడు అంబాల ప్రభాకర్ (ప్రభు) మంగళవారం రోజు ఏసీపి నివాసానికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇనుగాల సతీష్, మేకల శివ, ఇనుగాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

