
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: 2023-24 విద్యా సంవత్సరంలో చదువు, ఇతర రంగాలలో విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ఇవ్వనున్నట్లు పోపా (పదృశాలీ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్) కరీంనగర్ జిల్లా శాఖ నిర్ణయించారు. ఈ నెల 22 వ తేదిలోగా దరఖాస్తులు సమర్పించాలని, దరఖాస్తు ఫారములకు, ఇతర వివరములకు జిల్లా పోపా ప్రతినిధులు ఓడ్నాల రామకృష్ణ, తవటం సంపత్ కుమార్, బొప్పరాజు రమేష్ లను లేదా 8328633392, 9492839344, 9989048657 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.





