Oplus_0
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కరీంనగర్ జిల్లా నూతన పురుష యువ విభాగ కో ఆర్డినేటర్ (DYC ) గా హుజురాబాద్ పట్టణానికి చెందిన అకినపల్లి శ్రవణ్ కి బాధ్యతలు అప్పగించినట్లు వారు ఒక ప్రకటనలో తెలిపారు. స్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా యువ విభాగం వారిచే మరిన్ని సేవా కార్యక్రమాలు జరగాలని, కొత్త యువతి యువకులను ఈ సంస్థలోకి రావాలని శ్రవణ్ పిలుపునిచ్చారు. స్వామి శతజయంతి ఉత్సవాలలో మన కరీంనగర్ జిల్లా అగ్రభాగాన నిలవాలని కోరుకుంతున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా శ్రవన్ నియామకం పట్ల ఆయన మిత్రులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు.






