Oplus_0
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: సబ్సిడీ సిలిండర్ల ధ్రువపత్రాలను శనివారం హుజురాబాద్ పట్టణంలోని ఏడో వార్డులో లబ్ధిదారులకు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కొలిపాక నిర్మల అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… సంవత్సరానికి మూడు సబ్సిడీ సిలిండర్లు అందజేస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరు సబ్సిడీ సిలండర్ల ధ్రువపత్రాలను పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు అధికారి అనసూయ, పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు.






