
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: ఈనెల 28న హుజురాబాద్ పట్టణంలో డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ పాలడుగు అలేఖ్య అన్నారు. శనివారం కోర్టు హాలులో వివిధ పాఠశాలల, కళాశాలల ప్రిన్సిపాల్ లు, ప్రధానోపాధ్యాయులకు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఇందిర, ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి, మ్యాక రాములు తదితరులు పాల్గొన్నారు.






