
మండల యాదగిరి, స్వర్దయం ప్రతినిధి కరీంనగర్ అక్టోబర్ 17:
ఆరోగ్య మహిళా కార్యక్రమంపై మహిళలకు అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు. గురువారం రేకుర్తిలోని బస్తీ దవాఖానను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ల్యాబ్, మందుల గది, రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం డీఎంహెచ్ఓ సుజాతను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. బస్తీ దవాఖానాలో ఉచితంగా అందిస్తున్న వైద్య సేవలు, రోగనిర్ధారణ పరీక్షల గురించి మహిళలకు వివరించాలన్నారు. కుక్క,పాము కాటుకో సంబంధించిన మందులు అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొన్నారు. ప్రజలకు వైద్యంపై అవగాహన కల్పించేలా బస్తీ దావఖానాలో టీవీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో బస్తీ దవాఖాన వైద్యాధికారి మౌల్య, ప్రోగ్రామ్ ఆఫీసర్ సనా, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు ఉన్నారు








Once ramnagar hospital ki kuda round sveyandi hospital lo nurse vundaram lesu