
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంను పురస్కరించుకొని టీచర్ ఎక్సలేన్స్ అవార్డు-2024 కార్యక్రమాన్ని హైదరాబాదుకు చెందిన శారద ఎడ్యుకేషన్ సొసైటీ అండ్ స్కై లైఫ్ ఫౌండేషన్ వారు హైదరాబాదులోని బిర్లా మందిర్ ఆడిటోరియంలో ఆదివారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా 33 జిల్లాల నుండి టీచర్ ఎక్సలెన్స్ అవార్డుకు ఎన్నిక కాబడిన 50 మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. జమ్మికుంట మండలంలోని కోరపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న గుడిమిల్ల బలరాం ఈ అవార్డుకు ఎంపికైన సందర్భంగా సొసైటీ చైర్మన్ డాక్టర్ పట్నం కమల మనోహర్ మరియు ముఖ్య అతిథులు టీచర్ ఎక్సలేన్స్ అవార్డును ప్రధానం చేస్తూ సన్మానించారు. అవార్డు అందుకున్న సందర్భంగా గుడిమిల్ల బలరాంను జమ్మికుంట మండల విద్యాధికారిని మంతెన హేమలత, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఎస్ సమ్మయ్య, కోరపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంతం రాజిరెడ్డి, ఉపాధ్యాయులు దెబ్బేట రవీందర్, ఎస్ కుమారి ఉపాధ్యాయుని, ఉపాధ్యాలు అభినందించారు.
