
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ (సైదాపూర్): ఈరోజు సైదాపూర్ మండలం వెన్నంపల్లి లోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలను (ఆర్జెడి) రీజినల్ జాయింట్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ వరంగల్ సత్యనారాయణరెడ్డి వెన్నంపల్లి పాఠశాలలను సందర్శించారు. అందులో భాగంగా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు. పాఠశాల పరిసరాలను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమములో హై స్కూల్ తో పాటు ప్రాథమిక పాఠశాలను కూడా పరిశీలించి అన్ని విషయాలలోనూ ఆర్జెడి సంతృప్తిని వ్యక్తము చేశారు. ఇందులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్ ప్రభాకర్ రెడ్డి మరియు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. శ్రీనివాస్, ఉపాధ్యాయులు కేతిరి శ్రీనివాస్ రెడ్డి, వి ప్రవీణ్ కుమార్, సత్యనారాయణ రెడ్డి, కుమార్, వీరారెడ్డి, సత్య, జయప్రద, పద్మ. నలిని తదితరులు పాల్గొన్నారు.








