
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, నవంబర్ 08: హుజురాబాద్ పట్టణంలోని శ్రీ చైతన్య కరికులం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ కాకతీయ పాఠశాల విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులు వారి మాతృ సంస్థ అయిన దేశంలోని వివిధ నగరాలలో నిర్వహిస్తున్న శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు సాధించిన సూపర్ హ్యాట్రిక్ వరల్డ్ రికార్డ్ విజయాల సంబరాల్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మాట్ల సందీప్ కుమార్ మాట్లాడుతూ.. నవంబర్ 6న ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సూపర్ హట్రిక్ వరల్డ్ రికార్డ్ ఈవెంట్లో 20 రాష్ట్రాల నుంచి పదివేల మంది శ్రీ చైతన్య విద్యార్థులు మూడు గంటల్లో 600 గణితపు సూత్రాలను ఏకకాలంలో యూకే లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు ఎదుట పఠి0చి ప్రపంచ రికార్డు సృష్టించారని ఈ ఘనత సాధించిన విద్యార్థులందరూ 3-10 ఏళ్ల లోపు చిన్నారులే కావడం విశేషమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, ఏజీఎం ముద్రకోల రాజు, కోఆర్డినేటర్ ప్రవీణ్, డీన్ శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.






