
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లి జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో 2007-08 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా ఎంతగానో అలరించింది. పూర్వ విద్యార్థులు పాఠశాల జీవనములో నడుచుకున్న విధానంపై ఒకరినొకరు గుర్తు చేసుకుని ఆనందపడ్డారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఆనందంగా గడిపారు. నాడు చదువు చెప్పిన పూర్వ ఉపాధ్యాయులైన రామ్ రెడ్డి, మారుతి, వెంకటరమణి, హస్మత్ ఉనిస బేగంలకు శాలువాలు కప్పి సత్కరించి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కేశబోయిన అశోక్, రవీందర్, సలాం, లావణ్య, సుధా, హేమలత తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

