
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: ధర్మారం మండలం ఖమ్మర్ఖాన్ పేట గ్రామ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న క్రికెట్ టోర్నీని ఆదివారం ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండల నాయకులతో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మొదట టాస్ వేసి మ్యాచ్ ను ప్రారంభించి నిర్వహణ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెలుపు ఓటములు సహజమని, క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆడాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.








