
స్వర్ణోదయం రిపోర్టర్, జమ్మికుంట: ఇటీవల యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా శీలం సురేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా హరీష్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీణవంక బస్టాండ్ వద్ద శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మా గెలుపుకు సహకరించిన నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కర్ర భవన్ రెడ్డి, గంగాడి తిరుపతిరెడ్డి, ఎక్కటీ రఘుపాల్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






